YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వామపక్షాల మాయలో పడొద్దు ఎంపీ జీవిఎల్ నర్శింహారావు

వామపక్షాల మాయలో పడొద్దు ఎంపీ జీవిఎల్ నర్శింహారావు

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ది ప్రధాని మోడీ లక్ష్య సాధ తోనే జరుగుతోందని రాజ్యసభసభ్యులు,జివిఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్ర నిధులు, సహకారంతోనే రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని,ఏపీలో రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని,ఎ న్నికలు పూర్తిగా ధన, డ్రామా చేసేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొద్ది రోజులుగా విశాఖలో పర్యటిస్తున్న జీవిఎల్ మీడియాతో మాట్లాడుతూ ... ఏపీలో బిజెపి ఒక్క సీటు గెలవక పోయినా, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. కానీ ఏపిలో టిడిపి, వైసీపీలు బిజెపి పట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. ఏపిలో బిజెపి చేసిన అభివృద్ది తప్ప వైసీపీ , టిడిపి నేతలు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.కేంద్రం, విశాఖ నగరానికి చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ బ్రొచర్ ను విడుదల చేసిన జివిఎల్ ... ఈనెల 8వరకు విశాఖలో పర్యటించి బిజెపి, జనసేన కూటమిని గెలిపించాలని అభ్యర్థిస్తామని చెప్పారు.స్టీల్ ప్లాంట్ అమ్మకాల పై వామపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని,స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడు జరిగేది కాదని,లాంగ్ రన్ ప్రోసెస్ లో కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.వామపక్షాల మాయలో ప్రజలు పడోద్దని కోరారు.స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు.

Related Posts