YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

భార్యలే కాలయుముళ్లు

భార్యలే కాలయుముళ్లు
భార్యలే.. భర్తల పాలిట యములవుతున్నరు.  స్వాతి... జ్యోతి.. ఘటనలు మరిచిపోకుండానే.... నిన్న నిజామాబాద్ లో ఒక్క రోజే..ముగ్గురు మహిళలు తమ భర్తల పాలిట కాలయయులయ్యారు. కారణాలు ఏమైనప్పటికి...హత్యలు మాత్రం కలకలం రేపుతున్నాయిరోజు తాగి రావడంతో పాటు వేధింపులకు గురిచేయడంతో ఓపిక నశించి ఒకరు.. కుటుంబ కలహాలతో మరొకరు తమ భర్తలను చంపేస్తున్నరు.కామారెడ్డి జిల్లా బాన్సువాడ లోని సంగమేశ్వర కాలనీకి చెందిన చిల్లర్గి సాయిలు  పీకల దాక తాగి ఇంటికి వచ్చి భార్య సునంద, కుమారుడు కిరణ్‌తో గొడవ పడేవాడు. భార్య, కొడుకును తీవ్రంగా కొట్టడంతో.. విసుగు చెందిన ఇద్దరూ సాయిలును రోకలి బండతో  కోట్టి  చంపేసింది. తర్వత మృతదేహాన్ని పక్కనే పాడుపడి ఉన్న ఇంట్లో పాతి పెట్టింది. చివరికి ఏమి తెలియనట్లు కనిపించకుండా పోయడాని సమాచారం  ఇచ్చింది. మూడు రోజులుగా సాయిలు కనిపించడం లేదని సాయిలు అన్న విఠల్‌  బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.  పోలీసుల మార్క్ విచారణతో ...తామే సాయిలును హత్య చేశామని భార్య ఒప్పుకొంది.   దీంతో ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు.ఇక జనగామ జిల్లాలో కుడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తను మొదటి భార్య చంపెసింది.  ఘన్‌పూర్‌ స్టేషన్‌ కు చెందిన రాయపురం ధర్మయ్య  రైల్వే ఉద్యోగి. ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మొదటి భార్య శాంతమ్మతో విడిపోయిన ధర్మయ్య,వెంకటలక్ష్మిని రెండో భార్యగా చేసుకుని వేరుగా ఉంటున్నాడు.  జీతంలో సగం మొదటి భార్య శాంతమ్మకు ఇస్తున్నాడు. అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  తన కూతురు స్వప్న పంచాయితీ కోసం రెండు కుటుంబాలు కలిశాయి. ఈ క్రమంలో భర్త ధర్మయ్యను ఇంటికి తీసుకెళ్లిన శాంతమ్మ భర్తతో కుర్చుని మద్యం తాగింది. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో  ధర్మయ మొదటి భార్య తలపై కోట్టి చంపింది.

Related Posts