YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ నేతల నిరసన

కాంగ్రెస్ నేతల నిరసన

ఇబ్రహీంపట్నం మార్చి 4, 
కృష్ణాజిల్లా ఇబ్రహీపట్నం మండలం కొండపల్లి బ్యాంక్ సెంటర్ లో కాంగ్రెస్ నాయకులు పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మైలవరం ఇన్చార్జి బొర్రా కిరణ్ మాట్లాడతు  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ రేట్ 70 రూపాయలు, డిజిల్ రేట్ 60 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ.100 రికార్డు చేరువలోకి వెళ్ళిందన్నారు. దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధినేతలు సంపన్నుల ఆదాయం పేంచేవిధంగా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించించారు. హందో – హమరా దో అనే నినాదంలో బీజేపీ కేంద్ర పెద్దలు ఉన్నారని, ప్రథాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్షాలు ఇద్దరు ముకేష్ అంబానీ, అధానీల సంపదలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారని కానీ ప్రజల కోసం ఎమీ చేయ్యడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
 

Related Posts