YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ ప్రభుత్వం పై బాలయ్య ఫైర్

జగన్ ప్రభుత్వం పై బాలయ్య ఫైర్

హిందూపురం మార్చి 4, 
ఏపీలో మాఫియా రాజ్యమేలుతోందన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య. ఐఏఎస్, ఐపీఎస్లు గత ప్రభుత్వంలో గౌరవంగా ఉండే వారనీ.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ల పరిస్థితి మారిపోయిందన్నారు. ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని.. వారిలో ఒకరు చంద్రబాబును తిట్టడానికి.. మరొకరు లిక్కర్ మాఫియా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో బాలయ్య ప్రచారం చేస్తున్నారు.మట్కా.. అసాంఘిక కార్యకలాపాలను గత పాలనలో కట్టడి చేశామని.. ఇప్పుడు ఇవన్నీ మళ్లీ రాజ్యమేలుతున్నాయన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. జవాబు దారి తనం ఉన్న పార్టీకి ప్రజలు ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు. హిందూపురంను గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. హిందూపురంలో ఎవ్వరు భయపడొద్దని.. ధైర్యంగా ప్రభుత్వంపై పోరాడాలన్నారు.  రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నారని బాలయ్య మండిపడ్డారు. రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని.. నిత్యావసర ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్నారు. ఇసుక.. మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయని, రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారం అయిందన్నారు.

Related Posts