హైదరాబాద్ మార్చ్ 4
తెలంగాణ గవర్నర్, పుదుచ్ఛెరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్-2021 అవార్డుకు ఎంపికయినారు.యు ఎస్ కాంగ్రస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డా. తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు.గవర్నర్ గారితో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైనారు.ఈ అవార్డును 9వ వార్షిక కాంగ్రషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ప్రధానం చేస్తారు. సమాజం హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా. తమిళిసై సౌందరరాజన్ కి ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.