YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 టాప్ ప్లేస్‌లో నిలిచిన బెంగ‌ళూరు

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020  టాప్ ప్లేస్‌లో నిలిచిన బెంగ‌ళూరు

న్యూఢిల్లీ మార్చ్ 4 
ప‌రూ భుత్వం విడుద‌ల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో బెంగ‌ళూరు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో పుణె, అహ్మ‌దాబాద్ ఉన్నాయి. న‌గ‌రాల్లో జీవ‌నం సాగించేందుకు అనుకూల ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఈ ర్యాంకుల‌ను కేటాయించారు. ఇందులో మిలియ‌న్ ప్ల‌స్ జ‌నాభా ఉన్న న‌గ‌రాల్లో బెంగ‌ళూరు ఫ‌స్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. టాప్ టెన్‌లో ఉన్న న‌గ‌రాలు ఒక‌సారి చూస్తే.. బెంగ‌ళూరు త‌ర్వాత పుణె, అహ్మ‌దాబాద్‌, చెన్నై, సూర‌త్‌, న‌వీ ముంబై, కోయంబ‌త్తూర్‌, వ‌డోద‌ర‌, ఇండోర్‌, గ్రేట‌ర్ ముంబై ఉన్నాయి. ఇక ప‌ది ల‌క్ష‌ల లోపు జ‌నాభా ఉన్న న‌గ‌రాల్లో షిమ్లా తొలి స్థానంలో ఉంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో భువ‌నేశ్వ‌ర్‌, సిల్వాసా, కాకినాడ‌, సేలం, గాంధీన‌గ‌ర్‌, గురుగ్రామ్‌, దేవ‌న్‌గిరి, తిరుచిరాప‌ల్లి ఉన్నాయి. దీనికి సంబంధించి 2020లో స‌ర్వే నిర్వ‌హించారు. మొత్తంగా 111 న‌గ‌రాలు ఇందులో పాల్గొన్నాయి. ప‌ట్ట‌ణాభివృద్ధి కోసం తీసుకున్న చ‌ర్య‌లు, మెరుగైన జీవ‌న ప్ర‌మాణాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించిన‌ట్లు పీఐబీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇక వీటితోపాటు మున్సిప‌ల్ ప‌ర్ఫార్మెన్స్ ఇండెక్స్‌ను కూడా ప్ర‌భుత్వం రిలీజ్ చేసింది. ఇందులో మిలియ‌న్ ప్ల‌స్ కేట‌గిరీలో ఇండోర్ టాప్‌లో ఉండ‌గా.. సూర‌త్‌, భోపాల్ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిలియ‌న్ క‌న్నా త‌క్కువ జ‌నాభా కేట‌గిరీలో న్యూఢిల్లీ మున్సిప‌ల్ కౌన్సిల్ టాప్‌లో ఉండ‌గా.. తిరుప‌తి, గాంధీన‌గ‌ర్ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Related Posts