YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ బంద్

స్టీల్ ప్లాంట్ బంద్

పాడేరు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. వైజాగ్ స్టీల్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లో పాల్గొన్నాయి. అధికార పక్షం వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ సైతం మద్దతునిస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్ర బంద్కు మద్దతు గా మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమ య్యాయి.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీలో ప్రజా సంఘాలు నిరసనలు హోరెత్తించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించడంతో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, యూనివర్శటీలు మూతపడనున్నాయి.కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్లాంట్ ప్రవేటికరణం ప్రతిపా దనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Posts