YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

దేశానికి తెలంగాణ రోల్ మోడల్

దేశానికి తెలంగాణ రోల్ మోడల్

హైదరాబాద్ మార్చి 5, 
హైదరాబాద్ - రంగారెడ్డిః మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస అభ్యర్థి వాణి దేవి గెలుపు కోరుతూ శంషాబాద్ లోని ఓ ఆడిటోరియం లో  పట్టభద్రుల ఓటర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశం లో  ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ గౌడ్, ఎమ్మెల్సీదామోదర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.  మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మూడేళ్లలో కట్టాం. ఇది దేశానికే ఆదర్శం. ఈ ఏడాది కోటి ఒకరాల సాగు జరుగుతోంది. 70 ఏళ్లలో కేవసం౩౦ లక్షల ఎకరాల సాగు జరిగేదని అన్నారు.  రైతు బాగుపడితే దేశం బాగుపడుతోంది. ఊర్లు విడిచి వెళ్లిన వారు తిరిగి గ్రామాలను తిరిగి వస్తున్నారు. సాగు నీరు, రోడ్ నెట్ వర్క్,  ఇంటర్నెట్ సౌకర్యం,  కోతలు లేని విద్యుత్ ఇస్తున్నాం.అందుకే గ్రామాలకు తిరిగి వస్తున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు.  బీజేపీ వాళ్లు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఐటీఐఆర్ మా వల్ల రాలేదని చెబుతున్నారు. దీనిపై కేటీఆర్ కేంద్రానికి  డీపీఆర్ ఇచ్చారు. సీఎం లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ కు, కర్ణాటక రెండు రాష్ట్రాలకు ఐటీఐఆర్ ఇచ్చారు. తెలంగాణ లో మా ప్రభుత్వం ఉందని ఇవ్వలేదనికుందాం.  మరి కర్ణాటక కు ఎందుకు ఇవ్వలేదు. రెండింటిని ఎందుకు రద్దు చేశారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని, ఆ క్రెడిట్ వారికి దక్కకూడదనే ఐటీఐఆర్ ను రద్దు చేశారు.  బడ్టెట్ లో 2.50 లక్షల  ఎరువులు సబ్సిడీ కోత. గ్యాస్సబ్సిడీ లో కోత వుంది.  రాష్ట్రానికి బడ్జెట్ లోకోతలు, ప్రజలకు వాతలే మిగిలింది. ఎన్నికలు ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లకు మెట్రో విస్తరణకు అవకాశం ఇచ్చారు. కర్ణాటక లోను మెట్రో విస్తరణకు ఆమోదంతెలిపారు. గుజరాత్ కు బుల్లెట్ట్రైన్ ఇచ్చారు. తెలంగాణ కు మాత్రం మొండి చేయి చూపారు. మనం కట్టే పన్నుల్లో 50 శాతం కూడా తిరిగి మనకు రావడం లేదు. ప్రగతి సాధించే మన రాష్ట్రంకన్నా వెనుకబడిన బీహార్ వంటిరాష్ట్రాలకు బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఇచ్చారని అన్నారు.  మనకు మూడువేల కోట్లు డెవల్యూషన్ తగ్గించారు. మనకు విభజన చట్టంలో పేర్కోన్న  బయ్యారం ఉక్కు , రైల్వేకోచ్ ఫ్యాక్టరీ వంటి వి ఇస్తామని ఇవ్వలేదు. ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్సీ ఏం చేశారు. ఒక్క మంచి పని చెప్పమనండి. ఆరేళ్లలో 12  కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా. బీఎస్ఎన్ఎల్ లో  5౦ శాతం   మందిని ఉద్యోగులను తొలగించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు.  తెలంగాణ లోకూడా బీహెచ్ఈఎల్, బీడిఎల్ వంటి వాటిని ప్రయివేటుపరం చేస్తారు. ఉద్యోగులు ఆలోచించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు లేకుండా చేస్తుంది. ఐటీ గ్రోత్ లో మనం బెంగళూరును దాటి  తొలిస్థానంలో ఉన్నాం. మహిళా ఓటర్లు  మా మహిళా అభ్యర్థి వాణి దేవికి ఓటు వేయాలని కోరారు. 

Related Posts