YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తిరుమల మార్చి 5, 
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుక్రవారం ఉదయం తిరమల శ్రీవారిని దర్శించుకున్నారు.  అయన కుటుంబ సమేతంగా నిజపాద సేవలో పాల్గొన్నారు. సామాన్య భక్తునిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న ఉపరాష్ట్రపతికి టీటీడీ అధికారులు  ఇస్తికపాల్ స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఉప రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు వేదపండితులు లకు రంగ నాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించారు. తరువాత ఉప రాష్ట్రపతిని  టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి  స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు.

Related Posts