YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నారాయణపేట, కొడంగల్ లో మంత్రి వేముల పర్యటన

నారాయణపేట, కొడంగల్ లో మంత్రి వేముల పర్యటన

మహబూబ్ నగర్ మార్చి 5, 
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ,  శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి,పట్టభద్రుల ఎన్నిక ఉమ్మడి పాలమూరు జిల్లా పార్టీ సమన్వయ కర్త వేముల ప్రశాంత్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతుగా గురువారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, జడ్చర్ల, నారాయణపేట,కొడంగల్ నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,జైపాల్ యాదవ్,చిట్టెం రామ్మోహన్ రెడ్డి,డా.లక్ష్మారెడ్డి,రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి లతో కలిసి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో మీడియాతో మాట్లాడారు.  మంత్రి వేముల మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి మాత్రమే ఉంది. రాష్ట్ర ఏర్పాటు నుంచి కేవలం ఆరు ఏండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా అవతరించింది. తెలంగాణ ప్రభుత్వం పథకాలను కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలే ప్రశంసిస్తున్నారు. తెలంగాణ లో ఇంటింటికి నల్లాతో నీటిని ఇచ్చే మిషన్ భగీరథ పథకం లాంటిది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేపట్టాలని కేంద్రమే చెప్పిందని అన్నరు. ఇట్లాంటి అంశాలు అన్ని పట్టబద్రులైన నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు,టీచర్స్,మేధావులు ఆలోచన చేయాలి. బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎన్ని ఉద్యోగాలు ఎక్కువిచ్చారు..ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఎంతిస్తున్నారు అని వారిని మీరు ప్రశ్నించాలి. ప్రభుత్వానిది ఉద్యోగుల సంబంధం పేగుబంధం లాంటిది.టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిలవండని అన్నారు.
మీ సమస్యలపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు ముఖ్యమంత్రి కి ఉన్నది కాబట్టి వాటిని కచ్చితంగా పరిష్కరించుకుందాం. బీజేపీ,కాంగ్రెస్ భావోద్వేగ మాటలకు మోసపోకండి. వాళ్లు గెలిస్తే ఏం చేయగలరో కూడా ఆలోచించండి. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి ని గెలిపించి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అడిగితే కాదనరు. విద్యావంతురాలు,చిత్రలేఖ కళాకారిణి పూర్వ భారత ప్రధాని పి.వి కుమార్తె అయిన టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి ఓటు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ సమస్యలు పరిష్కారానికి స్థానిక ఎమ్మెలతో కలిసి నేను బాధ్యత తీసుకుంటా అని మంత్రి అన్నారు.

Related Posts