YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా చేరికలు

వైకాపా చేరికలు

విజయనగరం మార్చి 6, 
తెలుగుదేశం పార్టీ విధివిధానాలకు విసిగి వేసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం అభినందనీయమని విజయనగరం నియోజకవర్గ శాసన సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.తన నివాసంలో 50 వ వార్డు పరిధిలో వైయస్సార్ నగర్ కు చెందిన తెలుగుదేశం పార్టీ వార్డు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే కోలగట్ల సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి రావడం శుభపరిణామం అన్నారు. నేటి నుంచి వీరు వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులని, అందరూ సమిష్టిగా పనిచేసి వార్డు అభ్యర్థులను గెలిపించాలన్నారు. 2024 కల్లా నగరంలో మౌలిక వసతులు సమస్య లేకుండా చేయడమే తన లక్ష్యమన్నారు.
 

Related Posts