YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

భూ తగాదాలతో సింగరేణి రిటైర్డ్ కార్మికుని దారుణ హత్య పోలీసుల అదుపులో అనుమానితులు

భూ తగాదాలతో సింగరేణి రిటైర్డ్ కార్మికుని దారుణ హత్య పోలీసుల అదుపులో అనుమానితులు

రామగుండం మార్చి 6,  భూమి తగాదాలతో సింగరేణి రిటైర్డ్ కార్మికుని కొందరు దారుణంగా హతమార్చిన సంఘటన కోల్ బెల్ట్ లో సంచలనం రేపింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రశాంత్ నగర్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బండారి మొగిలి ని గత రాత్రి ఇంటి నుంచి ఓ వ్యక్తి భూమి గురించి మాట్లాడుదామని తీసుకు వెళ్ళి, కాలనీ చివర మల్కాపూర్ చెరువు కట్ట వద్ద చంపేశారు. అదే కాలనీ లో ఉన్న భూమి విషయంలో బండారి మొగిలి తోపాటు మరికొందరికి మధ్య విభేదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో గతంలో పలుమార్లు వివాదాలతో పాటు పోలీసులకు వద్దకు చేరాయి. ఇదే క్రమంలో దీంతో రాకేష్ అనే వ్యక్తి తీసుకువెళ్ళి చంపాడని మొగిలి కుమారుడు రమేష్ ఆరోపిస్తున్నాడు. రాకేష్ తోపాటు తిరుపతి, చింతల రాజు మరికొందరి హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కాగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన వన్ టౌన్ సీఐ రమేష్ బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ హత్యకు పాల్పడినట్లు భావిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related Posts