YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వరుడిని చితకబాదిన వధువు బంధువులు

వరుడిని చితకబాదిన వధువు బంధువులు

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 6, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి చేసి నవ వధువుని కిడ్నాప్ చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో చోటు చేసుకుంది.  స్థానికుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకి చెందిన 24 ఏళ్ళ యువకుడు వీరంకి రాజేష్ అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు.. వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఈ ప్రేమజంట పెద్దలకు తెలియకుండా టీ నర్సాపురం గ్రామంలోని ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత వీరిద్దరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని తిరుమలకుంట గ్రామంలో వరుడు రాజేష్ మేనమామ ఇంటికి వచ్చి ఆశ్రయం పొందారు.. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తిరుమలకుంట గ్రామం వచ్చి  నవ వధువుతో చూసి వెళదామని వచ్చామని పిలిచి ఆపై ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు.. ఈ విషయాన్ని గమనించిన నూతన వరుడు రాజేష్ అడ్డుపడేందుకు ప్రయత్నించగా వారంతా కలిసి రాజేష్ ను చితకబాది యువతినీ అపహరించుకుపోయారు బాధిత యువకుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Related Posts