YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కుదిరిన ఒప్పందం..తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు

కుదిరిన ఒప్పందం..తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు

చెన్నైమార్చి 6, 
తమిళనాడులో బీజేపీ- ఏఐఏడీఎంకే సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. గత కొద్ది రోజులుగా చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కన్యాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు 20 సీట్లు కేటాయించినట్లు ఏఐఏడీఎంకే తెలిపింది. ఈ మేరకు ఒప్పందంపై శుక్రవారం రాత్రి సీఎం ఎడప్పాడి కే పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌ సెల్వం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడులో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ సంతకాలు చేశారు. ఒప్పందం కాపీని రాత్రి మీడియాకు విడుదల చేశారు. రాబోయే రెండు రోజుల్లో ముహూర్తం సరిగా లేనందున.. అర్ధరాత్రి సప్తమి తిథి ముగిసేలోపు ఈ ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల వివరాలను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.  ఇప్పటికే పీఎంకే నాయకులు శుక్రవారం రాత్రి ఏఐఏడీఎంకే బృందంతో చర్చలు జరిపారు. అంతకు ముందు అధికార పార్టీ తన మొదటి ఆరుగురు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. సీఎం పళనిస్వామి, పన్నీర్‌సెల్వం సహా మరో నలుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 234 అసెంబ్లీ స్థానాల్లో 43 సీట్లను పీఎంకే, బీజేపీలకు కేటాయించింది. కనీసం 170 సీట్లలో పోటీ చేయాలని ఏఐఏడీఎంకే యోచిస్తోంది. కూటమిలోని మరో పార్టీ అయినా డీఎండీకే 25 సీట్లలో బరిలోకి దిగాలని యోచిస్తోంది. 15 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటును ఆ పార్టీకి కేటాయించాలని ఏఐఏడీఎంకే నిర్ణయానికి వచ్చిందని, ఈ మేరకు ఆ పార్టీకి తెలిపినట్లు సమాచారం. ఇంకా జీకే వాసన్‌ నేతృత్వంలోని తమిళ మనీలా కాంగ్రెస్‌, మరో మూడు చిన్న పార్టీలకు సైతం సీట్లు కేటాయించాల్సి ఉంది.

Related Posts