YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళల కోసం దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్        సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం

మహిళల కోసం దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్        సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం

మహిళల కోసం దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్ 
సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం
900 దిశ పెట్రోల్ వెహికల్స్ 18 దిశ క్రైం సీన్ మేనేజ్ మెంట్ వెహికల్స్ ప్రారంభం
సైబర్ కియోస్క్లను సీఎం ఆవిష్కరణ
బాలికలకు ఉచిత నాప్కిన్స్ కార్యక్రమం ప్రారంభం
అమరావతి మార్చ్ 8 
ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్ ను మహిళల కోసం ప్రవేశ పెట్టనున్నట్టు జగన్ ప్రకటించారు.   ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో సీఎం మాట్లాడుతూ మహిళా బడ్జెట్ గురించి చెప్పుకొచ్చారు. మహిళ అంటే ఆకాశంలో సగ భాగమని.. ఆర్ధిక సామాజిక రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు.కుటుంబానికి చుక్కానిలా ఉండి అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవన్నారు.గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అమ్మఒడి వైఎస్ ఆర్ చేయూత వైఎస్ ఆర్ ఆసరా కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం వైఎస్ ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చాం ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో 60 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. ఇప్పటికీ 40 శాతం మంది మహిళలకు చదువు అందడం లేదు. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చాం అని తెలిపారు. రెండేళ్లలో రూ.13220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చాం. ఐదేళ్లలో రూ.32500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తాం. వైఎస్సార్ చేయూత కింద రూ.4604 కోట్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు రూ.27వేల కోట్లు ఇచ్చాం. అమ్మఒడి వైఎస్ ఆర్  ఆసరా వైఎస్ ఆర్ చేయూత ద్వారానే 21 నెలల్లో రూ.80వేల కోట్లు అందించాం. మహిళా ఉద్యోగుల క్యాజువల్ లీవ్స్ 20 రోజులకు పెంచాం. 13 జిల్లాల్లో దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. మహిళలపై నేరాలకు సత్వర విచారణ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.ఇదిలా ఉండగా 900 దిశ పెట్రోల్ వెహికల్స్ 18 దిశ క్రైం సీన్ మేనేజ్ మెంట్ వెహికల్స్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. జీపీఎస్ దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్లను సీఎం ఆవిష్కరించారు. బాలికలకు ఉచిత నాప్కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని 10 మందికి మించి మహిళలు ఉన్న కార్యాలయాల్లో కమిటీలు నియమిస్తామని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ మహిళా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

Related Posts