YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జూలూరుపాడులో భట్టీ సైకిల్ యాత్ర

జూలూరుపాడులో భట్టీ సైకిల్ యాత్ర

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 9, 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో మధిర శాసనసభ్యులు సిఎల్పీ నేత భట్టివిక్రమార్క సైకిల్ యాత్రచేసారు. యాత్రలో భాగంగా మంగళవారం నాడు మండల కేంద్రంలో చంద్రుగొండ ప్రధాన రహదారి పై  వంట వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ, కేసీఆర్  ప్రభుత్వాలు కమీషన్లకు కక్కుర్తి పడి గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై  మోయలేని భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు కేసీఆర్, మోడీ ప్రభుత్వాలకు కాలం చల్లిందన్నారు  ప్రజల తరపున నిలబడి పోరాటం చేయడానికి ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈసైకిల్ యాత్రకు అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చానాగేశ్వరావు సంఘీభావం తెలిపారు

Related Posts