YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ ప్రతిష్ట దెబ్బతీయటం సరికాదు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

 టీటీడీ ప్రతిష్ట దెబ్బతీయటం సరికాదు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

తాడేపల్లి మార్చ్ 10 
టీటీడీ ప్రతిష్ట దెబ్బతీయటం సరికాదు. ఆంధ్రజ్యోతిలో టీటీడీకి సంబంధించి వచ్చిన తప్పుడు  వార్తలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. వెంకటేశ్వరస్వామి భక్తుడిని నేనని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు. బుధవారం అయన తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసారు. తరువాత అయన మాట్లాడుతూ సీఎం జగన్ తండ్రి వైఎస్ తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆంధ్రజ్యోతి లో వచ్చిన కథనాల వెనక చంద్రబాబు ఉన్నాడు. ఆంధ్రజ్యోతి పై పరువునష్టం దావా వేశా. టీటీడీ లావాదేవీలపై కాగ్ ఆడిట్ చేయించేందుకు సీఎం అంగీకరించారని అయన అన్నారు.  స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ కేంద్ర పరిధిలోని అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని అయన అన్నారు. ఇదివరకే ప్రధానికి సీఎం రెండు సార్లు లేఖ రాశారు. ప్రధానితో సీఎం జగన్ చర్చలు జరుపుతారని అనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకమని అయన అన్నారు.

Related Posts