YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరాస వెంటిలెటర్ పైనుంది బండి సంజయ్

తెరాస వెంటిలెటర్ పైనుంది బండి సంజయ్

హైదరాబాద్ మార్చ్ 10 
ఇప్పటివరకు మిమ్మల్ని ఒక్కసారైనా కెసిఆర్ ఓటు వేయమని అడిగారా. ఓటు వెయమని అడగనపుడు ఓట్లు ఎందుకు ఓట్లు వెయ్యాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అన్నారు. సచివాలయం కి రాని కెసిఆర్ కి జీతం ఎందుకు ఇవ్వాలి. కెసిఆర్ పార్లమెంట్ కి వెళ్లకుండా సంతకాలు పెట్టించారు . మేము పిర్యాదు చేస్తాము ..కెసిఆర్ రాజీనామా చేయాలి. కెసిఆర్ , కెటిఆర్ లది అబ్బదాల యూనివర్సిటీ. టిఆరెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉంది. ఎన్నికల కోడ్ ఉండగా 29 శాతం ఫిట్మెంట్ ఏ విధంగా ప్రకటిస్తారు. 14 వ తేదీన రెండు ఎమ్మెల్సీ స్థనాలని బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.  మంత్రులు ,ఎమ్మెల్యే లు టిఆరెస్ కార్యకర్తలే వారి అభ్యర్ధులని వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు యాచించవద్దు. శాసించాలి. ప్రజలు ఆపదలో ఉన్నపుడు కాపాడింది బీజేపీ పార్టీ ..మిమ్మలని కాపాడానికి టిఆరెస్ , కాంగ్రెస్ పార్టీలు వచ్చాయా అని ప్రశ్నించారు.
ఆర్టీసీ నిర్వీర్యం కావడానికి కారణం ఎవరు. మానవత్వం లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కెసిఆర్ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో కోవిద్ వ్యాక్షన్ తాయారు చేస్తే చెప్పలేని పరిస్థితిలో కెసిఆర్ ఉన్నాడని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర అభివృద్ని కాంక్షించిన పార్టీ బీజేపీ. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంటే ..కెసిఆర్ తన ఫొటోలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు లేఖలు రాస్తున్నారు అంటే ..తెలంగాణ అభివృద్ధి ని టిఆరెస్ కోరుకోవడం లేదు. కేంద్ర నిధులు లేని సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి కెసిఆర్ ..అంటే ఇప్పటివరకి చెప్పలేదని అన్నారు. 2023 లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా రెపరెపలాడించడమే మా లక్ష్యం. పీవి నరసింహరావు ఘాట్ ని సందర్శించని కెసిఆర్ కి ఇప్పుడు పీవి నరసింహరావు గుర్తుకొచ్చారా. పీవి నరసింహరావు ఘాట్ ని ఓవైసీ కూలగొడతాము అన్నపుడు కెసిఆర్ ఎందుకు స్పందించలేదు. ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్ తెలంగాణాలో ఎందుకు అమలు చేయడం లేదు. డబ్బులు మనవే డబ్బులు తీసుకొని బీజేపీ కి ఓట్లు వేయండని అయన అన్నారు.మార్చ్ 14 అంటే పేరాసిటమాల్ రోజని అయన అన్నారు. 

Related Posts