YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మూడో కూటమి అభ్యర్ధిగా కమల్

మూడో కూటమి అభ్యర్ధిగా కమల్

చెన్నౌ, మార్చి 10, 
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాట రాజకీయం రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది. కూటములలోని పార్టీలు అటు, ఇటూ మారి, చివరికి కొత్త కూటమి ఆవిర్భవించింది. కమల్ రాకతో అది బలంగా మారింది. ఆ తర్వాత మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడు పార్టీలతో ఏర్పడిన మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘మక్కల్‌ నీది మయ్యం (MNM)’ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ పేరు ఖరారైంది. ప్రజలకు విరోధులుగా వ్యవహరించే ప్రతి ఒక్కరినీ తాము లక్ష్యంగా చేసుకుంటామని కమల్‌ ప్రకటించారు.ఇండియా జన నాయక కట్చి (IJK) నేతృత్వంలోని మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌ బరిలోకి దిగుతున్నట్లు శరత్‌ కుమార్‌ ప్రకటించారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎంఎన్‌ఎం 154 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఎస్‌ఎంకే, ఐజేకే చెరో 40 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.ఐజేకేను పారివేందర్‌ స్థాపించారు. అన్నాడీఎంకే కూటమిలో కొనసాగిన ఐజేకే గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో చేరింది. లోక్‌సభ ఎన్నికల్లో పారివేందర్.. పెరంబలూరు స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తమకు ఒకట్రెండు స్థానాలను మాత్రమే కేటాయించే పరిస్థితి ఎదురవడంతో కూటమి నుంచి వైదొలిగారు. తన కుమారుడు రవి పచ్చముత్తును పార్టీ అధ్యక్షుడిగా చేసి మూడో కూటమి ప్రయత్నాలు ప్రారంభించారు.ఇక.. అన్నాడీఎంకే, బీజేపీ మినహా మరే కూటమిలోనైనా చేరేందుకు ఎదురుచూస్తున్న కమల్‌ హాసన్ ఐజేకే కూటమిలో చేరారు. అటు సీట్ల సర్దుబాటుపై పిలుపు రాకపోవడంతో అలిగిన ‘సమత్తువ మక్కల్‌ కట్చి’ అధ్యక్షుడు శరత్‌ కుమార్‌ కూడా అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగి ఐజేకేతో చేతులు కలిపారు. దీంతో ఈ కూటమి మరింత బలపడినట్లైంది.అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎండీకేను కూడా కమల్‌ తమ కూటమిలోకి ఆహ్వానించారు. సీట్ల పంపకం కుదరక అన్నాడీఎంకే కూటమితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు డీఎండీకే ప్రకటించింది. ఆ వెంటనే డీఎండీకేని మూడో కూటమిలో చేర్చుకునేందుకు కమల్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు.ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 186 చోట్ల పోటీ చేయనుంది. కూటమిలో కాంగ్రెస్‌ పార్టీకి 25 సీట్లు కేటాయించగా.. సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, వీసీకేలకు ఆరేసి చొప్పున స్థానాలను కేటాయించారు. ఐయూఎంఎల్, ఎంఎంకేలకు కలిపి 5 సీట్లు కేటాయించారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలున్నాయి. ఏప్రిల్ 6న ఒకే విడతన ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడవుతాయి.

Related Posts