YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అస్సోంలో బీజేపీ నేతపై హత్యాయత్నం...

అస్సోంలో బీజేపీ నేతపై హత్యాయత్నం...

గౌహాతి, మార్చి 10, 
అసోంలో ఎన్నికల వేళ బీజేపీ కీలక నేత, మంత్రి హిమాంత బిస్వా శర్మ హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉల్ఫా ఉపాధ్యక్షుడు ప్రదీప్ గొగొయ్ సహా ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హిమాంత శర్మకు సీఆర్పీఎఫ్ సిబ్బందితో జడ్ ప్లస్ భద్రత కల్పించారు. ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ.. ‘సోమవారం రాత్రి ఫోన్ చేసిన డీజీపీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. అంతేకాదు, నా భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు’ అని అన్నారు.సిల్చార్‌ ఎన్నికల ప్రచారంలో మంగళవారం పాల్గొన్న మంత్రి హిమాంతా బిస్వా.. ‘దేవుడు, తల్లిదండ్రులు, ప్రజలకు మాత్రమే భయపడతాను’ అన్నారు. అంతకు ముందు మజూలీ స్థానానికి ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్‌ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఉల్ఫా వైస్-ప్రెసిడెంట్, కర్బీ అంగ్లాంగ్ వద్ద అరెస్ట్ చేసిన నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ద్వారా మంత్రిని హత్యచేయడానికి కుట్ర పన్నినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.‘అంగ్లాంగ్ వద్ద సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించాం.. తర్వాత వారిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించాం.. వారిని మూడు రోజుల కస్టడీకి కోర్టు అప్పగించింది’ అని పోలీస్ అధికారులు తెలిపారు. ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు పేర్కొన్నారు. అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరగనుండగా.. తొలి దశ పోలింగ్ మార్చి 27న జరగనుంది.యువకుడైన హిమాంత బిస్వా శర్మ ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఎన్నికల ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరు. ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో రోజుకు కనీసం ఆరు ర్యాల్లీలో పాల్గొని, సుడిగాలి ప్రచారం చేశారు. పదిహేనేళ్ల పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దే దించి బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు.

Related Posts