YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నెల రోజులు టైం అడిగిన రేవంత్ రెడ్డి.. కోర్టు వాయిదా

నెల రోజులు టైం అడిగిన రేవంత్ రెడ్డి.. కోర్టు వాయిదా

హైదరాబాద్, మార్చి 10, 
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీరేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈరోజు ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణకు వచ్చింది. అయితే కేసు విచారణను నెల రోజులు వాయిదా వేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున్న కేసును ఏప్రిల్ 8 వరకు వాయిదా వేయాలని రేవంత్ పిటిషన్‌లో కోరారు.అందుకు ఏసీబీ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చాలని ఏసీబీ కోర్టును కోరింది. రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విచారణ జాప్యం చేస్తున్నారని ఏసీబీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయన తరఫు న్యాయవాది సమక్షంలో సాక్షుల విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

Related Posts