హైదరాబాద్, మార్చి 13,
అమ్మకి అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. అలాగే ఉంది మినిస్టర్ కేటీఆర్ పరిస్థితి. ఇదీ బీజేపీ లీడర్ రాములమ్మ మాట. మరి విజయశాంతి సెటైర్లు మామూలుగా ఉంటాయా చెప్పండి. దుమ్ములేచి పోతాయి కదా. ఈ సామెత కూడా ఇప్పుడు అంతే పాపులర్ అయిపోతుంది.ఎప్పుడొచ్చాం అన్నది కాదు.. ఎన్ని సార్లు మాట్లాడాం అన్నది కాదు.. ఎన్ని ట్వీట్లేసి.. లైకులు లవ్ లు కొట్టేశాం అన్నది కాదు. ఇలా ఒక్క మాటతోనే మ్యాటర్ మొత్తం అర్దం అయిపోవాలి అనేలా ఉంది అంటూ.. రాములమ్మ కామెంట్ కి ఫుల్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సరిలేరు మీకెవ్వరూ మేడమ్ అంటూ.. ఆమె ఫాలోవర్స్ అంతా.. ఆమె కామెంట్ ని షేరింగులతో ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. రీసెంట్ గా విశాఖ ఉక్కుపై మినిస్టర్ కేటీఆర్ ఏం మాట్లాడారో అందరికీ తెలిసిందే కదా. ఉక్కు ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నాం. వారు కోరితే.. సీఎం కేసీఆర్ పర్మిషన్ తీసుకుని.. అక్కడికి వచ్చి.. ఏపీ తరపున ఏపీ జనాల తరపున కేంద్రంతో కొట్లాటకి రెడీ అన్నారు కదా. ఆ మాటలపైనే విశాయశాంతి సెటైర్లు వేశారు. అంతేనా. ఇంకా చాలా లిస్టే పట్టుకున్నారు. తెలంగాణలో మూత బడిన ఫ్యాక్టరీలను, పరిశ్రమలను తెరిపించి. వంద రోజుల్లో రెడీ చేయించి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అన్నారు. అవి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు కానీ.. ఏపీలోకి వెళ్లి ఏదో చేస్తామంటున్నారా అంటూ.. కామెంట్ చేశారు రాములమ్మ.ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇలా ఏదేదో మాట్లాడుతున్నారే తప్ప.. ఆంధ్ర ప్రజలపై కేటీఆర్ ఫ్యామిలీ ఇంటెన్షన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు చెప్పండి. గతంలో వారు మాట్లాడిన మాటలు ఓసారి గుర్తు తెచ్చుకుంటే.. వారు ఆంధ్ర ప్రజలను ఎలా ట్రీట్ చేస్తారో అర్దం అవుతుంది అంటూ.. పోస్ట్ పెట్టారు.