YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మద్యం స్వాధీనం

మద్యం స్వాధీనం

హైదరాబాద్ మార్చి 13, 
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి నార్సింగ్ పొలీస్టేషన్ పరిధిలో కొకాపేట్ లో పోలీసులుభారీగా మద్యం పట్టుకున్నారు. ఆదివారం  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్ కు ప్రభుత్వం  ఉత్తర్వలిచ్చింది.  ఎన్నికల నేపద్యంలో కొంతమంది దొడ్డిదారిన మద్యం అమ్మేందుకు పధకం పన్నారు. మద్యాన్ని  నిలువ ఉంచందుకు   ప్రయత్నించారు. కోకాపేట్ లో ఒక ఇంట్లో మద్యం నిలువ ఉంచారన్న పక్క సమాచారంతో నార్సింగ్ పొలీసులు ధాడులు నిర్వహించారు.  లక్ష రూపాయల విలువచేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చెపట్టారు.

Related Posts