పెద్దపల్లి మార్చి 13,
రామగుండం ఏరియా బొగ్గుగనుల పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు జరిగాయి. గోదావరిఖని 2ఏ బొగ్గుగని పై టిబిజికెఎస్ నాయకులు పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో కార్మికుల 43 కిలోల కేక్ కట్ చేసారు. గోదావరిఖని 2 ఇంక్లైన్ బొగ్గుగని పై టీబీజీకేఎస్ ట్రెజరర్ వెంకటేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసారు. గోదావరిఖని వన్ ఇంక్ లైన్ బొగ్గుగని పై అర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసారు.