కొత్తకోట మార్చి 13, ఆదివారం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొత్తకోట మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ఎమ్మార్వో వెంకటేశ్వర్లు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆదివారం జరగబోయే పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లను కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఓటు హక్కును వినియోగించుకోవటానికి వచ్చే ప్రతి ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందితో కలిసి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాను సారం కోవిడ్ నిబందనలు పక్కాగా పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.