YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి ఘోర పరాభవం

టీడీపీకి ఘోర పరాభవం

టీడీపీకి ఘోర పరాభవం
విజయవాడ, మార్చి 15, 
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం పాలయింది. ముందు నుండీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి చెప్పుకోదగ్గ స్థానాలు వస్తాయని చంద్రబాబు సహా పార్టీ నేతలు భావిన్చారుయ్. కానీ చంద్రబాబు, అచ్చెన్నాయుడు సొంత జిల్లాలలో సైతం వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం చర్చనీయాంశంగా మారింది. లుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మున్సిపల్ ఎన్నికలు కూడా కలసి రాలేదు. అన్ని జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని దారుణంగా దెబ్బతీశాయి. ఎక్కడా తెలుగుదేశం పార్టీ సరైన పనితీరును కనపర్చలేదు. ఒక్క జిల్లా అంటూ లేదు.. ఒక ప్రాంతం అంటూ లేదు. ఏరియాలకు ఏరియాల్లోనే చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి ఘోరమైన ఫలితాలు రావడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది.పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను భయభ్రాంతులను చేశారని చంద్రబాబు ప్రజల్లో భ్రాంతి కలిగించబోయారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడంతో దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరిగాయి. కొంచెం నాయకత్వం గట్టిగా ఉన్న చోట మాత్రమే చంద్రబాబు పార్టీ కొద్దో గొప్పో వార్డులను గెలుచుకోగలిగింది. చంద్రబాబు గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్ లలో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు గుంటూరు, కర్నూలు కార్పొరేషన్లలో టీడీపీ ఘోర ఓటమిని చవి చూసింది.అమరావతి రాజధాని, పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవడం, నిరుద్యోగం, అరాచక పాలన పైనే చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. జగన్ పాలన రెండేళ్లలో పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత కన్పించిందన్న అంచనా వేశారు. ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకపోవడం వైసీపీకి మైనస్ గా మారుతుందని చంద్రబాబు భావించారు. మున్సిపల్ ఎన్నికల్లో నాయకత్వ లోపం తీవ్రంగా కన్పించింది.తాడిపత్రి, హిందూపురం, అద్దంకి వంటి చోట్ల బలమైన నాయకత్వం ఉన్నందున అక్కడ కొంత మెరుగైన పనితీరును కనపర్చిన తెలుగుదేశం పార్టీ మిగిలిన మున్సిపాలిటీల్లో పడకేసింది. చంద్రబాబు పార్టీ రాష్ట్ర కమిటీని, పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికలు చంద్రబాబు షాకిచ్చాయనే చెప్పాలి. ప్రస్తుతం చంద్రబాబుకు ఓటమి పై రివ్యూ చేసుకోవడం మినహా అధికార పార్టీపై ఇన్నాళ్లూ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దాదాపుగా రిపీట్ అయ్యాయనే చెప్పాఅనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మినహా ఎక్కడా వైసీపీకి టిడిపి పోటీ ఇవ్వలేకపోయింది.టీడీపీకి, నందమూరి కుటుంబానికి సైతం పెట్టని కోట అని భావించే హిందూపురంలో సైతం పార్టీని బాలయ్య గట్టెంచలేకపోయారు.  కార్పొరేషన్లలో సైతం టీడీపీ ప్రభావం చూపలేకపోయింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేసిన కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ లలో సైతం వైసీపీ సత్తా చాటింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం పాలయిందనే చెప్పాలి. మరి దీని మీద చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

Related Posts