YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ కి గుణపాఠం

టీడీపీ కి గుణపాఠం

విశాఖపట్నం మార్చి 15, 
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్సా ర్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో అయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును విశాఖ ప్రజలు మరోసారి తిరస్కరించార న్నారు.విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ప్రజలు స్వాగతించారని పేర్కొన్నా రు. విశాఖ ఎన్నికలు 3 రాజధానులకు రెఫరెండమన్న చంద్రబాబు ఇప్పుడే మంటారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. సెల్ఫ్ సర్టిఫికెట్ మేధావి యనమల మున్సిపాలిటీలో ఘోర పరాభవం చవిచూశారని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని.. ఇకనైనా చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఎమ్మెల్యే అమర్నాథ్ డిమాండ్ చేశారు.58 సీట్లు గెలుపునకు విజయ సాయి రెడ్డి కృషి ఫలితమేనని చెప్పారు.గుంటూరు లో వైసిపీ కి ఓటు వేయొద్దు అని ప్రచారం చేసినా ప్రజలు బ్రహ్మ రధం పట్టారని,జగన్మోహనరెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నామని తెలిపారు.

Related Posts