హైదరాబాద్ మార్చి 15,
తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక పద్దును ఆమోదించేందుకు శాసనసభ, మండలి కొలువుదీరాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగించారు. తొలిరోజు కావడంతో సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే పరిమితం అయ్యాయి రెండు సభల సభా వ్యవహారాల సలహా సంఘాలు సమావేశమవుతాయి. . బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేస్తాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు జరుగుతున్నాయి. ఒక వరుసలో ఒకరే కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. 16వ తేదీన రెండు సభల్లోనూ సంతాప తీర్మానాలు, 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. అలాగే 18న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.