మహబూబాబాద్ మార్చి 15, మహబూబాబాద్ లో ఆదివారం నుంచి ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నెల్లికుదురులో టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ నేపధ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈనెల 17వ తేదీ వరకు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రస్తారోకోలు వంటి కార్యక్రమాలను నిషేధించారు. ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. పట్టణంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ కార్యాలయం ముందు బీజేపీ నేతల ఆందోళన..
పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంప్ ఆఫీసు ఎదుట నిరసననకు దిగారు. దీంతో పోలీసులు-బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్ రావు తో పాటు 20 మంది కార్యకర్తలు, బీజేవైఎం, ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి బలవంతంగా వ్యానులో తరలించారు. నిరసనకారులు బీజేపీ పార్టీ కి ఎమ్మెల్యే శంకర్ నాయక్ బహిరంగ క్షమాపణ చెప్పా లని.. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా..నినాదాలు చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, శంకర్ నాయక్ గూండాయిజం నశించాలి.. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.