YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బ్యాంకు సిబ్బంది సమ్మె సంపూర్ణం

బ్యాంకు సిబ్బంది సమ్మె సంపూర్ణం

హైదరాబాద్ మార్చి 15, 
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా బ్యాంకర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో... హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా కోఠి లోని ఎస్.బి.ఐ ప్రధాన కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బ్యాంక్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. డప్పు చప్పులకు మహిళా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు పదిలక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారని... యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన పరిస్థితి భాజపా ప్రభుత్వంలో రావడంపై యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రవేటికరణ చేసే ప్రతిపాదనను ఉపసహరించుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లపై రెండు రోజుల సమ్మె తర్వాత కూడా కేంద్రం ప్రభుత్వం దిగిరాక పోతే ప్రజా ఉద్యమంగా మార్చుతామని వారు హెచ్చరించారు.

Related Posts