YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అస్సోం, పుదుచ్చేరిపైనే ఆశలు

అస్సోం, పుదుచ్చేరిపైనే ఆశలు

న్యూఢిల్లీ, మార్చి 16 
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో అసోంపైనే భారతీయ జనతా పార్టీ పూర్తిగా శ్రద్ధను కేంద్రీకరించింది. అధికారంలో ఉన్న ఈ ఈశాన్య రాష్రాన్ని కాపాడుకోవడం పార్టీకి కీలకం. ఈశాన్యాన అసోం అతిపెద్ద రాష్ర్టం. దక్షిణాన తమిళనాడు, కేరళల్లో పార్టీకి విజయావకావాలు ఎంతమాత్రం లేవు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక బెంగాల్లో పార్టీ బలంగా ఉన్న మాట వాస్తవమే. అయితే మమతను గద్దె దించేంత బలం కాషాయ పార్టీకి లేదన్నది నిజం. ఈ విషయం పార్టీకి తెలియకపోలేదు. పుదుచ్చేరి చాలా చిన్నది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడ పార్టీ బలం నామమాత్రం. ఎన్నికలు జరగనున్న అయిదురాష్రాల్లో ఒక్క అసోంలోనే భాజపా బలంగా ఉంది, అధికారంలో ఉంది. అందువల్ల ఇక్కడ మళ్లీ గెలవాలన్న లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోంది.ఈ ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్రమోదీ గత 20 రోజుల్లో రెండుసార్లు అసోంలో పర్యటించారు. జనవరి 16న శివసాగర్ జిల్లాలో పర్యటించి గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. తాజాగా ఫిబ్రవరి 7న రెండోసారి రాష్రాన్ని సందర్శించారు. తేయాకు తోటలకు పేరుగాంచిన ధెకియాజులి ప్రాంతంలో పర్యటించారు. ఫిబ్రవరి 6న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అసోం రాజధాని గౌహతీ నగరాన్ని సందర్శించారు. అభివద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలకు వచ్చినట్లు చెబుతున్నప్పటికీ అసలు ఉద్దేశం ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమేగత ఎన్నికల్లో తొలిసారి కాషాయ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. అప్పట్లో అసోం గణ పరిషత్ (ఏజీపీ), బోడో పీపుల్స్ ఫ్రంట్ (బీ పీ ఎఫ్) తో పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించింది. బీజేపీ 61, ఏజీపీ 13, బీపీఎఫ్ 14 సీట్లు సాధించాయి. ముఖ్యమంత్రి సర్బానంద్ సోనావాల్ నాయకత్వంలోని ప్రభుత్వం గత అయిదేళ్లుగా అధికారంలో కొనసాగుతోంది. ముగ్గురు బోడో మంత్రులు కేబినెట్ లో ఉన్నారు. బోడో ప్రాంతీయ మండలి ఎన్నికల పై భాజపా, బీపీఎఫ్ మధ్య ఇటీవల కాలంలో కాలంలో తేడాలు వచ్చాయి. దీంతో ఈసారి రెండుపార్టీలు విడివిడిగా పోటీ చేయనున్నాయి. ఏజీపీతో మత్రం పొత్తు కొనసాగుతుంది. దీంతోపాటు కొత్తగా ఆవిర్భవించిన యునైటెడ్ పీపుల్స్ పార్టీతో కలసి పోటీ చేయనున్నట్లు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ ప్రకటించారు.2001 నుంచి 2016 వరకు వరుసగా మూడు దఫాలు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ అయిదేళ్ల క్రితం ఎన్నికల్లో ఓటమిపాలై బీజేపీకి అధికారాన్ని అప్పగించింది. నాటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 19 సీట్లకు పరిమితమైంది. ఈసారి అధికార సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎం, సీపీ ఐ (ఎంఎల్), అంచాలిక్ గణ మోర్చా, సుగంధ ద్రవ్యాల వ్యాపారి, పార్లమెంటు సభ్యుడు, అఖిల భారత యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయుడీఎఫ్) అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అజ్మల్ పార్టీ గత ఎన్నికల్లో 14 సీట్లు సాధించింది. ఈ పార్టీకి ముస్లింలలో మంచి పట్టుంది. గతఎన్నికల్లో కాంగ్రెస్, అజ్మల్ పార్టీ విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్నాయి. దీంతోఈసారి పొత్తు పెట్టుకున్నాయి. ఈసారి తమ కూటమి విజయం తథ్యమని పీసీసీ చీఫ్ రిపున్ బోరా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీలది అప్రవిత్ర కలయికని, ప్రజలు తిరస్కరిస్కరించడం ఖాయమని మరోపక్క బీజేపీ నేతలు పేర్కొంటున్నారు

Related Posts