హైదరాబాద్ మార్చ్ 16
బైంసా అల్లర్లకు నిరసనగా.. లవ్ జిహాదీలకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో డిజిపి కార్యాలయం ముట్టడించారు. హైదరాబాద్ లకడికాపూల్ లోని డిజిపి కార్యాలయాన్ని అందోళన కారులు ముట్టడించారు. ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో.. అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా కార్యకర్తలు అక్కడికి రావడంతో వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుండి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీహెచ్పీ , బజంగ్దల్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చెయ్యడాన్ని వారు ఖండించారు