YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు సీఐడీ ఇచ్చిన నోటిసులపై మంత్రి కొడాలి ఘాటైన వ్యాఖ్యలు

చంద్రబాబుకు సీఐడీ ఇచ్చిన నోటిసులపై మంత్రి కొడాలి ఘాటైన వ్యాఖ్యలు

విజయవాడ మార్చ్ 16  చంద్రబాబుకు సీఐడీ ఇచ్చిన నోటిసులపై మంత్రి కొడాలి ఘాటైన వ్యాఖ్యలు అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేసి దళిత వర్గాలను మోసం చేశారు. చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలి మంత్రి కొడాలి నాని
నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్ భూము ల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపింది.ఈ నోటీసులివ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ నోటీసులు, టీడీపీ నేతల విమర్శలపై మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్ర బాబు అండ్ కో భారీ భూ స్కాంలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో, దళిత వర్గాలను మోసం చేశారని నాని వ్యాఖ్యానించా రు.అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారని దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాల న్నారు.రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కాం లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటని కొడాలి నాని ప్రశ్నించారు.

Related Posts