YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చలు!

న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చలు!

న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చలు!
హైదరాబాద్ మార్చ్ 16 
నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ ఉదయం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపద్యం లో  నోటీసులపై చంద్రబాబు తన అత్యంత సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చంద్రబాబు తన ఇంటికి న్యాయనిపుణులను పిలిపించుకున్నారు. అసలు సీఐడీ విచారణకు హాజరుకావాలా? వద్దా ? అనే అంశంపై కీలకంగా చర్చిస్తున్నారు. నోటీసులపై కోర్టుకు వెళ్లే అంశాన్ని న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ నోటీసులపై ఇప్పటి వరకూ చంద్రబాబు కానీ.. నారాయణ కానీ స్పందించలేదు. బాబు ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే జగన్ సర్కార్ ఇలా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోందని టీడీపీ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. చాలా రోజులుగా అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలుపై రాద్ధాంతం జరుగుతోంది.విజయవాడ నుంచి ఇవాళ ఉదయం 8 గంటలకే హైదరాబాద్‌కు రెండు బృందాలుగా వచ్చిన సీఐడీ అధికారులు జూబ్లిహిల్స్‌లోని బాబు నివాసానికి వెళ్లి నోటీసులిచ్చారు. అనంతరం టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు రావాలని ఇరువురికీ ఇచ్చిన నోటీసుల్లో ఉన్నట్లు తెలిసింది.

Related Posts