YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అన్నదాతలకు మళ్లీ డబ్బులు

అన్నదాతలకు మళ్లీ డబ్బులు

అన్నదాతలకు మళ్లీ డబ్బులు
న్యూఢిల్లీ, మార్చి 16, 
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగించేందుకు రెడీ అవుతోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద 8వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేందుకు సిద్ధం అవుతోంది.మోదీ సర్కార్ అన్నదాతలకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. పీఎం కిసాన్ స్కీమ్‌ కింద మరో విడత డబ్బులు అందించేందుకు సిద్ధమౌతోంది. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ స్కీమ్ కింద నేరుగా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 7 విడత డబ్బును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు అందించేందుకు రెడీ అవుతోంది. మార్చి నెల చివరి కల్లా రైతులకు ఈ డబ్బులు అందే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి.
మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు రైతులకు అందుతున్నాయి. ఇప్పుడు 8వ విడత డబ్బులు రానున్నాయి.దేశవ్యాప్తంగా 11.27 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్నారు. మీరు ఇప్పటికీ కూడా ఈ స్కీమ్‌లో చేరకపోతే ఇప్పుడైనా చేరొచ్చు. లేదంటే ఇప్పటికే చేరి ఉండి కూడా డబ్బులు రాకపోతే ఎక్కడ పొరపాటు జరిగింతో.. మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లిన తర్వాత ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత బెనిఫీషియరి స్టేటస్ ఆప్షన్ ఉంటుందిన దీన్ని ఎంచుకోవాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ స్టేటస్ వివరాలు తెలుస్తాయి.

Related Posts