YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

4 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ

4 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ

4 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ
గాంధీనగర్, మార్చి 16,
జరాత్‌లో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు మెట్రో నగరాలు.. అహ్మదాబాద్‌, వడోద‌ర‌, సూర‌త్‌, రాజ్‌కోట్‌‌లో రాత్రి పూట క‌ర్ఫ్యూ (Night Curfew) విధించాల‌ని నిర్ణయించింది. రోజూ రాత్రి 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్రభుత్వం తెలిపింది.మార్చి 17 నుంచి 31 వ‌ర‌కు ఈ నైట్ క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌నిగుజరాత్ ప్రభుత్వం తెలిపింది. నైట్ క‌ర్ఫ్యూకు స‌న్నాహ‌కంగా ఈ నాలుగు మెట్రో న‌గ‌రాల్లో మంగళవారం (మార్చి 16) అర్ధరాత్రి 12 గంట‌ల నుంచి ఉద‌యం ఆరు గంట‌ల వ‌ర‌కు ప్రీ-నైట్ క‌ర్ఫ్యూ సిస్టమ్ అమ‌ల‌వుతుంద‌ని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్నారు.గత ఏడాది నవంబర్‌లో నవరాత్రులు, దీపావళి పండగల అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరగడంతో గుజరాత్ ప్రభుత్వం తొలిసారిగా రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. నాటి నుంచి కొత్త కేసులు తగ్గకపోవడంతో ఆ కర్ఫ్యూను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా రాత్రి కర్ఫ్యూను ఆరోసారి పొడిగించారు.గుజరాత్‌లో ఇప్పటివరకు 2,70,000 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,70,000 బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా గుజరాత్‌లో ఇప్పటివరకు 4,425 మంది మరణించారు.

Related Posts