YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో రిహార్సల్స్...

తెలంగాణలో రిహార్సల్స్...

తెలంగాణలో రిహార్సల్స్...
హైదరాబాద్, మార్చి 16,
తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేయాలని చూస్తున్న కొత్త పార్టీ గురించి టీడీపీ మాజీ ఎంపీ, టీడీపీ నేతజేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. సీఎల్పీ కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్లతో ముచ్చటించారు. అలాగే మీడియాతో కూడా చిట్ చాట్ చేశారు. అయితే, విలేకరులు షర్మిల పార్టీ గురించి స్పందించాలని కోరగా జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల రాజకీయంగా ప్రాక్టీస్ చేయడానికే తెలంగాణలో పార్టీ పెడుతుందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.‘షర్మిల మొండి మనిషి. పట్టుదల గల మనిషి కూడా. తెలంగాణలో ఆమె వెనక ఏ పార్టీ లేదు. ఇక్కడ ఆమె కేవలం ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే వచ్చింది. ఏడాదిన్నర తర్వాత షర్మిల క్యాంప్ విజయవాడకి షిఫ్ట్ అవుతుంది. రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరం లేదు. ఏపీలో అవసరం ఉందని ఆమె గ్రహిస్తుంది. ఆమె పార్టీ విషయంలో మోదీ కల్పించుకునే స్థితి వస్తే ఏంచేస్తుందో చూడాలి. ఆమెకు తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి లేదు. ఏం ఇక్కడి తెలంగాణ నాయకులు పిచ్చివాళ్లా?’’ఏపీలో షర్మిలకు ఉప ముఖ్యమంత్రి లేదా ఇతర పదవులు ఇస్తే అప్పుడు ఆమె సొంత పార్టీ ఏర్పాటుపై పునరాలోచన చేస్తుందేమో. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా బంగారు తెలంగాణ మాత్రం రాలేదు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఉన్నా నాశనమే. పార్టీలో ఉండే అన్న, తమ్ముడు, చెల్లి, అల్లుడు అందరికీ పదవులు కావాలి. జాతీయ పార్టీలే నయం. అనాయ్యం జరిగితే అడిగేవాడు ఉంటాడు. ప్రాంతీయ పార్టీలో ఏం జరిగినా ఎవరూ అడగరు.’’ అని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Related Posts