YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మా సీఎం జగన్‌ కు నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలి మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి

మా సీఎం జగన్‌ కు నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలి మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి

మా సీఎం జగన్‌ కు నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలి
        మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 16 
నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులివ్వడాన్ని మాజీ ఎంపీ, టీడీపీ కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. మంగళవారం నాడు తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నేతలతో సుమారు అరగంటకు పైగా మాట్లాడారు. బయటికొచ్చాక మీడియాతో పలు విషయాలు మాట్లాడిన తర్వాత.. చంద్రబాబుకు సీఐడీ ఇచ్చిన నోటీసులపై జేసీ స్పందించారు. ఈ సందర్భంగా ‘మా సీఎం.. మా వాడు’ అంటూ జగన్‌ను సంభోదిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ మా అధినేత చంద్రబాబుకు ఒక్క కానిస్టేబుల్ మాత్రమే వెళ్లి ఒకే ఒక్క కాగితం (నోటీసులు) ఇచ్చాడు. కానీ మా సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి, ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వాలంటే లారీలు కావాలి. దొనకొండ లేదా వైజాగ్ రాజధాని చేయాలని చంద్రబాబుకు మేం ఆనాడే చెప్పాం. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని ఆయన చెప్పారు. చంద్రబాబుకు సీఐడీ ఒక్క పేజీలో మాత్రమే నోటీసు ఇచ్చింది. అదే జగన్‌కు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాలి’ అంటూ జేసీ వ్యంగ్యంగా మాట్లాడారు.

Related Posts