YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బాలికపై అత్యాచారం చేయించిన ప్రియురాలు

బాలికపై అత్యాచారం చేయించిన ప్రియురాలు

 నానాటికీ పెరిగిపోతున్న అత్యాచార ఉదంతాలతో మహిళా లోకం ఆందోళన చెందుతుంటే.. ఓ మహిళే తన కూతురు లాంటి ఆడబిడ్డను ప్రియుడితో అత్యాచారం చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ శివార్లలోని షాబాద్ డెయిరీ సమీపంలో 13 ఏళ్ల ఓ బాలిక తన తండ్రితో కలిసి ఉంటోంది. బాలిక తల్లి చాలా ఏళ్ల కిందటే మరణించడంతో ఆ తండ్రి ఆమెకు అన్నీ తానై చూసుకుంటున్నాడు. వారి నివాసానికి సమీపంలో అతడికి వరసకు సోదరి అయిన ఓ మహిళ  ఉంటోంది.బాలిక తండ్రి ఏదైనా పని నిమిత్తం బయటకి వెళ్లినప్పుడు ఆమెను ఆ మహిళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్లేవాడు. ఈ కారణంగా వరసకు అత్త అయిన ఆమెతో ఆ బాలికకు చనువు ఏర్పడింది. దీంతో ఆమె తరచూ ఆ ఇంటికి వెళ్లేది. అయితే.. ఆ మహిళ ముకేశ్ కుమార్ అనే ట్రక్ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం నెరపుతోంది. ఆమెతో తరచూ రాసలీలలు సాగించడానికి వచ్చే ముకేశ్.. ఆ బాలికపైనా కన్నేశాడు.ముకేశ్ ఓ రోజు తన మనసులోని కోరికను ప్రియురాలికి చెప్పాడు. దీంతో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ కోరిక తీర్చడానికి సిద్ధమైంది. ఎప్పటిలాగే తన ఇంటికి వచ్చిన బాలికకు ఆల్కహాల్ కలిపిన కూల్ డ్రింక్ తాగించింది. బాలిక తాగనని చెప్పినా బలవంతంగా తాగించింది. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ వేచి చూస్తున్న ప్రియుడు ముకేశ్‌కు ఆ బాలికను అప్పగించింది. ప్రియురాలు కాపలాగా ఉండగా.. ముకేశ్ ఆ పసిబాలికపై తన పశువాంఛ తీర్చుకున్నాడు. అనంతరం అతడు అక్కడ నుంచి వెళ్లిపోగా.. ఆ మహిళ బాలికను ఆమె ఇంటి వద్ద వదిలేసి ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయింది. బాలిక తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడం, ఆమె జననాంగాల నుంచి రక్తస్రావం అవుతుండటంతో కంగారు పడిన ఆ తండ్రి ఆమెను పరుగుపరుగున ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై అఘాయిత్యం జరిగిందని చెప్పేసరికి ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది.

Related Posts