YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మూడు టీలపై దృష్టి పెట్టండి

మూడు టీలపై దృష్టి పెట్టండి

న్యూఢిల్లీ, మార్చి 17, 
దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆపాల్సిందేన‌ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. దీనికోస నిర్ణ‌యాత్మ‌క అడుగులు వేయాల‌ని చెప్పారు. దేశంలో కొవిడ్ మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో బుధ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మావేశ‌మయ్యారు. . రాష్ట్రాల అభ్య‌ర్థ‌న మేర‌కు 45 ఏళ్లు పైబ‌డిన వాళ్లంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని ఈ స‌మావేశంలో కేంద్ర‌ ఆరోగ్య శాఖ ప్ర‌తిపాదించింది. ఇక క‌రోనాకు చెక్ పెట్ట‌డానికి మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని, భౌతిక దూరం నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింది. జ‌నం గుమిగూడే అవ‌కాశం ఉన్న ఈవెంట్ల‌లో అద‌న‌పు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌మెంట్‌, వ్యాక్సినేష‌న్ ప‌క్రియ కొన‌సాగాల‌ని సూచించింది.ఇక ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కూ 96 శాతం మంది కోలుకున్నార‌ని, చ‌నిపోయిన వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒక‌ట‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ చెప్పారు. ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయాల్సిన అవ‌స‌రం లేదు. ప‌రిస్థితుల‌ను అలా ఆందోళ‌న‌క‌రంగా చేయాల్సిన ప‌ని లేదు. కొన్ని ముందు జాగ్ర‌త్తలు, చ‌ర్య‌ల ద్వారా ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను దూరం చేయాలి అని మోదీ సూచించారు. కొన్ని ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య త‌గ్గ‌డాన్ని మోదీ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఎందుకు టెస్టుల సంఖ్య త‌గ్గింద‌ని ప్ర‌శ్నించారు. మ‌న కాన్ఫిడెన్స్‌, ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌గా మార‌కూడ‌దు అని స్ప‌ష్టం చేశారు. ఇక వ్యాక్సిన్ వృథాపై కూడా ప్ర‌ధాని మాట్లాడారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ల‌లో వ్యాక్సిన్ వృథా 10 శాతం కంటే ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని మోదీ చెప్పారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ వృథాను స‌మీక్షించాల‌ని సూచించారు. అస‌లు ఎందుకు వృథా అవుతోందో ప్ర‌తి రోజూ పర్య‌వేక్షించాల‌ని, అస‌లు వృథా లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు.
వ్యాక్సినేషన్ వెంటనే అందించండి
కరోనాపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ అడ్డుగా మారింది. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో మునిగిపోయింది. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఇక ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవి కూడా జరిగిపోయి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు, జాప్యం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చు. లేకపోతే వైరస్‌ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం..ఇవన్నీకూడా కష్టం అవుతాయి. మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి అధికారులు ప్రయత్నించాలి. ప్రభుత్వం తరఫున అధికారికంగా గవర్నర్‌కు, హైకోర్టుకు నివేదించాలి' అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దృృష్టి పెట్టాలని, 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్లు సత్వరమే అందించాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడం కన్నా... ఆ వైరస్ ‌రాకుండా నివారణా పద్ధతులపై దృష్టిపెట్టాలని తెలిపారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని, పూర్తిస్థాయిలో నూటికి నూరుశాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Posts