చిత్తూరు జిల్లా పిలేరు మండలం తానా వడ్డిపల్లి వద్ద గురువారం ఒక లారీ భీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనం పైకి దూసుకుపోయింది. గ్రామంలో జరుగుతున్న జాతర కోసం వచ్చిన వారు రోడ్డు పై నిలుచుకొని ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక ఇన్నోవా కారు తో పాటు అక్కడ నిలబడిన జనం పైకి సిమెంట్ లారీ. దూసుకొచ్చింది. కడప నుంచి పీలేరుకు సిమెంట్ లోడుతో వస్తున్న లారీ అతివేగంగా అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు నిమ్మనపల్లి మండలం కొండసానివారిపల్లి కి చెందినవారుగా గుర్తించారు. లారీ డ్రైవర్ పరారీలో వున్నాడు