YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పిలేరులో లారీ భీభత్సం

పిలేరులో లారీ భీభత్సం

చిత్తూరు జిల్లా పిలేరు మండలం తానా వడ్డిపల్లి వద్ద గురువారం ఒక లారీ భీభత్సం సృష్టించింది. అదుపు తప్పి జనం పైకి దూసుకుపోయింది. గ్రామంలో జరుగుతున్న  జాతర కోసం వచ్చిన వారు రోడ్డు పై నిలుచుకొని ఉండగా ఈ ప్రమాదం జరిగింది.  ఒక ఇన్నోవా కారు తో పాటు అక్కడ నిలబడిన జనం పైకి సిమెంట్ లారీ. దూసుకొచ్చింది. కడప నుంచి పీలేరుకు సిమెంట్ లోడుతో వస్తున్న లారీ అతివేగంగా అదుపు తప్పడంతో  ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు నిమ్మనపల్లి మండలం కొండసానివారిపల్లి కి చెందినవారుగా గుర్తించారు. లారీ డ్రైవర్ పరారీలో వున్నాడు 

Related Posts