YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పోలీస్ స్టేషన్ లో డబ్బు మాయం

పోలీస్ స్టేషన్ లో డబ్బు మాయం

ఏలూరు, మార్చి 17, 
పశ్చిమగోదావరి జిల్లాలో పోలీస్ స్టేషన్‌లో డబ్బులు మాయం కావడం కలకలంరేపింది. నాలుగు వైన్ షాపులకు సంబంధించి వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో ఉంచిన రూ.8 లక్షలు మాయం అయ్యాయి. రెండు రోజులుగా బ్యాంకులు సెలవులు కావడంతో ఎక్సైజ్ సిబ్బంది పోలీస్ స్టేషన్ లాకర్‌లో వైన్ షాప్‌లకు సంబంధించి కలెక్షన్ డబ్బు ఉంచారు. బుధవారం నగదు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వైన్ షాపుల సిబ్బంది రాగా.. నగదు కనిపించకపోవడంతో కంగుతిన్నారు.ఇలా ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే డబ్బులు మాయం కావడం సంచలనంగా మారింది.. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ చోరీపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. డబ్బును ఎవరైనా చోరీ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పీఎస్‌తో పాటూ చుట్టుపక్కల ఉన్నా సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించే పనిలో ఉన్నారు

Related Posts