YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తాడిపత్రిలో వైసీపీ వ్యూహం

తాడిపత్రిలో వైసీపీ వ్యూహం

అనంతపురం, మార్చి 17, 
ఆంధ్రప్రదేశ్‌గా ఇటీవల విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 మున్సిపాలిటీల్లో వైసీపీ తిరుగులేని ఆధిక్యత సాధించింది. అయితే వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అత్యధిక స్థానాలు సాధించింది. అయితే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఇప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాడిపత్రి పీఠాన్ని కైవసం చేసుకునేది తామేనని జేసీ ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే.. జేసీ ఫ్యామిలీకి ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారం దక్కకుండా చూసేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.వైసీపీని ఏ మాత్రం తక్కువగా అంచనా వేయని జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను హైదరాబాద్‌లోని రహస్య శిబిరానికి తరలించింది. టీడీపీ శిబిరంలో ఆ పార్టీ తరఫున గెలిచిన 18 మంది కౌన్సిలర్లతో పాటు ఒక సీపీఐ, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌ ఉన్నారు. ఈ 20 మందిలో ఏ ఒక్కరూ చేజారే అవకాశం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ శిబిరంలోని వారిని ఆకర్షించేందుకు వైసీపీ శక్తియుక్తులన్నీ ఒడ్డుతోంది. దీంతో కౌన్సిలర్లను హైదరాబాద్ నుంచి బెంగళూరు తరలించినట్లు తెలుస్తోంది.కాగా, తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 స్థానాలుండగా టీడీపీ 18, వైసీపీ 16, సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో చోట గెలిచారు. వైసీపీకి ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండటంతో వారి సంఖ్య 18కి చేరింది. అయితే టీడీపీ బలం 20గా ఉండటంతో చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ తరుణంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు వైసీపీ చివరి నిమిషంలో అదిరిపోయే వ్యూహం రూపొందించింది. చైర్మన్ పదవిని మైనార్టీలకు ఇస్తామని వైసీపీ ప్రకటించినట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో గెలిచిన 36 మంది కౌన్సిలర్లలో 11 మంది ముస్లింలు ఉన్నారు. వైసీపీ, టీడీపీ తరఫున ఐదుగురు చొప్పున ముస్లింలు విజయం సాధిచగా, మరొక స్వతంత్ర అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఈ తరుణంలో తమ పార్టీ తరఫున ముస్లింలకు చైర్మన్ పదవి ఇస్తామని వైసీపీ ప్రకటించింది. వైసీపీ ఇచ్చిన ఈ ఆఫర్‌తో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.

Related Posts