YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్సార్‌సీపీ నేతలపై రఘురామ పాటలు

వైఎస్సార్‌సీపీ నేతలపై రఘురామ పాటలు

న్యూఢిల్లీ, మార్చి 17, 
నర్సాపురం ఎంపరఘురామకృష్ణరాజు పాట పాడారు. గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అనే పాటను అందుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల కోసం ఈ పాటా పాడాను అన్నారు. తనకు గొంతు అంత శ్రావ్యంగా ఉండదని.. కాకపోతే తెలుగు స్పష్టంగా పాడగలిగాను అన్నారు. తమ మంత్రివర్గంలో ఇంత స్పష్టంగా పాడలేరని ఉద్దేశంతో పాడినట్లు చెప్పుకొచ్చారు. బావుంటే ఎంజాయ్ చేయండి.. లేకపోతే భరించండి అన్నారు.పోలీసులు, వాలంటీర్లతో మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఘనవిజయం సాధించిందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ ఫలితాల నుంచి తమ అధికార దుర్వినియోగం, అరాచకం పార్ట్‌-2 ప్రారంభమైందని.. మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు పెట్టి.. ఫలితాల తర్వాత నోటీసులిచ్చారన్నారు. ఇది కక్షసాధింపేనని.. గతంలో ఎస్సీపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మే 6న ముఖ్యమంత్రి విశాఖకు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తనకు తెలిసింది అన్నారు.మరోవైపు రఘురామ కృష్ణా, గుంటూరు జిల్లాలవారిపై చేసిన వ్యాఖ్యలుకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు కౌంటరిచ్చారు. దేశ రాజధానిలో చెట్ల కింద కూర్చొని ప్రజలకు సిగ్గులేదంటూ పాటలు పాడేవారికి ప్రజల విలువ తెలియదన్నారు. నియో జకవర్గానికి వెళితే ప్రజల విలువ తెలుస్తుందని ఎంపీలు నందిగం సురేష్, రెడ్డెప్ప వ్యాఖ్యానించారు. దొంగలా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తనకేదో అయిపోయినట్లు భావించే వారికి త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు.రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిన మోసాలు, అక్ర మాలకు నోటీసులు ఇస్తే రఘురామకృష్ణరాజు భుజాలు తడుముకుంటున్నారని ఎంపీలు ప్రశ్నించారు. వీధికుక్కలా మొరిగేవారిని మీడియా పట్టించుకోవడం సరికాదని.. రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ నడిబొడ్డున సమా ధానం చెప్పగలమన్నారు. కుప్పంలో గెలుస్తామని చెప్పి గెలిచామని మరోసారి ఎన్నికలు వస్తే ప్రస్తుతం కన్నా ఎక్కువ శాతం సీట్లతో గెలుస్తామన్నారు. చంద్రబాబు ఎప్పుడు జైలుకు వెళ్తారా.. పార్టీ పగ్గాలు అందుకుందామని లోకేశ్‌ ఆరాటపడుతున్నట్లుగా ఉందన్నారు

Related Posts