YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాగంటి బాబును పరామర్శించిన చంద్రబాబు

మాగంటి బాబును పరామర్శించిన చంద్రబాబు

మాగంటి బాబును పరామర్శించిన చంద్రబాబు
ఏలూరు మార్చ్17
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు ఏలూరులో పర్యటించారు.ఇటీవల పుత్ర వియోగం పొందిన టీడీపీ నేత మాగంటి బాబును ఆయన పరామర్శించారు.మాగంటి బాబు కుమారుడు రాంజీ ఇటీవల కన్నుమూశారు. రాంజీ మాగంటి బాబు పెద్ద కుమారుడు. టీడీపీ కార్యకలాపాల్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ తండ్రికి చేయూతగా నిలిచేవాడు. 37 ఏళ్ల రాంజీ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఏలూరులో చికిత్స అనంతరం విజయవాడ ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. స్వగ్రామంలో రాంజీ అంత్యక్రియలు నిర్వహించారు.ఈ క్రమంలో చంద్రబాబు మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలపై వారితో చర్చిస్తారు. పార్టీ బలోపేతంపై వారి అభిప్రాయాలు స్వీకరించారు. 

Related Posts