కోల్కతా మార్చ్ 18 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సంచలన ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు. తాజాగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో కూడా ఆయన పేరు లేదు. దీనిపై భిన్న ఊహాగానాలు వెలువడుతుండటంతో దిలీప్ ఘోష్ ఈ అంశంపై స్పందించారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారం మొత్తం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అధ్వర్యంలో జరగాలని హై కమాండ్ నిర్ణయింది. అందువల్లే తాను పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు.