YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోవిడ్‌ వల్ల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ప్రభుత్వ సాయం

కోవిడ్‌ వల్ల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ప్రభుత్వ సాయం

అమరావతి మార్చ్ 18 
జర్నలిస్టులపై ఆధారపడి కోవిడ్‌ వల్ల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులకు ఈ పరిహారం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దీనిపై నిర్ణయం తీసుకోగా.. బుధవారం ఉత్తర్వులిచ్చింది. కాగా, జర్నలిస్టుల కుటుంబాలకు పరిహారం అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు జర్నలిస్టు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.    

Related Posts