హైదరాబాద్ మార్చి 20, రాష్ట్రంలో తెలంగాణ పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ పురాణం సతీష్ అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రభుల్వం తరపున సమాధానమిచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రభుత్వ పరిశాలనలో ఉంది. ట్రిబ్యునల్ ఏర్పాటుపై వేసిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో ఈ తరహా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కమిటీ నివేదిక వచ్చాక, లాభ నష్టాలపై పూర్తి స్థాయి చర్చ అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.