జగిత్యాల మార్చి 22 రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకొని రుసుము చెల్లించి దాన్ని రద్దు చేసుకున్న పక్షంలో భూయజమానికి తిరిగి ఇవ్వాల్సిన రుసుము చెల్లింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని టీ బీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ప్రజల సమాచారం కోసం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు.చాలానా,స్టాంప్ డ్యూటీ,రిజిస్ట్రేషన్ ఫీజు,ఇతర రుసుములు చెల్లించిన యజమాని ..రద్దుకు సంబంధించిన దరఖాస్తును సమర్పించిన తరువాత ఆరు మాసాల్లోగా జిల్లా కలెక్టర్లు తిరిగి చెల్లింపులు (రిఫండ్) చెయ్యాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారని,ఆరు మాసాలు దాటితే ఆదరఖాస్తును రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కు బదిలీ చేయాలని సూచించారని ప్రజల ప్రయోజనార్థం వివరించారు.