మండలిలో పల్లాకు స్వాగతం
హైదరాబాద్ మార్చ్ 22
వరంగల్- ఖమ్మం - నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన తరువాత సోమవారం తెలంగాణ శాసన మండలికి వచ్చారు. అయనకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు కలిసి శాసన మండలి ఆవరణలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ని శాలువాతో సన్మానించి, అభినందించారు.